![CM Revanth Tweet](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-13-21.jpg)
CM Revanth Tweet : హోరాహోరీగా సాగిన నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎట్టకేలకు ఫలితం వచ్చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు. మూడు రోజులుగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో.. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 43 మందితో పాటు బీజేపీ అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేయగా.. చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి కూడా ఎలిమినేషన్ కావడంతో చివరికి తీన్మార్ మలన్నన్ననే విజయం వరించింది.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్సెషల్ విషెస్ తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. కాగా, తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఇదే స్థానంలో ఆనాడు గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు. తాజాగా ఆయన గెలుపుతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోతున్నారు.