Pawan Kalyan :
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే చాలా భాగం పూర్తియిన, #OG, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఉన్న కొన్ని సినిమాలను వేగంగా తీయాలని అనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడితే ఈ ప్రాజెక్టులను కూడా తాత్కాలికంగా పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.
జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఏపీపై పూర్తి దృష్టి కేటాయిస్తున్నారు. గతంలో పొత్తు ఉంటుందని చెప్పిన ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని కంకణం కట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తన ఉభయ గోదావరి జిల్లాల్లో తలపెట్టిన ‘వారాహి యాత్ర’ సక్సెస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల తీవ్రతను ప్రతిభింబిస్తోంది. తన సినిమా కార్యక్రమాలను తాత్కాలికంగా పక్కన పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పూర్తి దృష్టిని రాజకీయాలపై నిలిపేందుకు ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు.