Dhoni Next IPL : వరల్డ్ ఫేమస్ బ్యాట్స్ మన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఆదివారం రాత్రి కోల్కతా నైట్ రైటర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చెపాక్ వేదికగా జరిగింది. ఇందులో సీఎస్కే ఘోర పరాజయం పాలైంది. కానీ అభిమానులు ఎలాటి నిరుత్సాహానికి గురికాకుండా తమ అభిమాన జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ మ్యాచ్ వేదికగా ధోని రిటర్మెంట్ చర్చకు తెరలేపారు.
చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు చివరి మ్యాచ్ కావడంతో జట్టులోని ఆటగాళ్లంగా మైదానం మొత్తం కలియదిరిగారు. గతంలో వరల్డ్ కప్ సాధించినప్పుడు సచిన్ టెండుల్కర్ ను భూజాలపై పెట్టుకొని పూర్తి జట్టు మైదానం అంతా కలియతిరిగింది. అయితే ఈ మ్యాచ్ ముగియగానే చెన్సై సూపర్ కింగ్స్ జట్టు కూడా కలియతిరగడంతో ధోనీ రిటైర్మెంట్ పై చర్చ తెరపైకి వచ్చింది. దీనికి తోడు సునీల్ గవాస్కర్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఇది ఆయన రిటైర్మెంట్ పై మరింత బలం చేకూరినట్లైంది.
చెపాక్ లో రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు ఉన్నప్పటికీ, లీగ్ దశలో మాత్రం సీఎస్కేకు ఇదే చివరిది. దీంతో ఆటగాళ్లు కూడా జట్టు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఈ వీడియోను సీఎస్ కే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చివర్లో చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాధన్ ఒక కీలక విషయం చెప్పారు. ‘వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ తప్పకుండా ఆడుతాడనే నమ్మకం మాకుంది.. అభిమానులు ఎప్పుడూ ఇలానే మద్దతుగా నిలవాలి’. అంటూ ఆయన కోరారు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ ఢిల్లీలోని క్యాపిటల్స్ తో వారి సొంత మైదానంలో సీఎస్ కే తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఒక వేళ ఈ మ్యాచ్ ఓడిపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ముంబై, లక్నో, బెంగళూర్ తో పోటీ పడాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ (మే 23), ఎలిమినేటర్ మ్యాచ్ (మే 24) చెన్నైతో జరుగుతాయి. చెన్సై టాప్ 2లో ఉంటే కూడా చెన్నైలోనే ెలిమినేటర్ మ్యాచ్ ను ఆడాల్సి వస్తుంది. రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.