![World Cup Celebrations](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-1-6.jpg)
World Cup Celebrations : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భారత్ ట-20 ప్రపంచ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన వేళ దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు బాణసంచా పేలుస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. సచివాలయం వద్ద జాతీయ జెండా పట్టుకొని, టపాసులు కాలుస్తూ యువత చిందులేస్తూ గడిపారు. భారత్ మాతాకీ జై.. అని నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. భారీగా అభిమానులు చేరుకోవడంతో ట్యాంక్ బండ్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.