Yoga Day 2023 : జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా మన దేశంలోనే పుట్టడంతో యోగా చేసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యోగా ప్రాముఖ్యతను గురించి ప్రచారం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో 180 దేశాలకు చెందిన ప్రజలు పాల్గొంటారు. దీంతో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
యోగా ప్రాధాన్యం తెలియడంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యోగా చేస్తున్నారు. దీంతో కలిగే లాభాల గురించి తెలియడంతో యోగా చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి రోజు యోగా చేయడం వల్ల మన అవయవాలు బాగా పనిచేస్తాయి. యోగా చేయడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయి.
రోజు ఉదయం యోగా చేయడం వల్ల మన ఒంట్లో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. రోగాలు రాకుండా చేయడంలో కూడా ప్రధాన పాత్ర పో షిస్తుంది. ఇలా యోగా చేస్తే మన శరీరంలోని అవయవాలు సరిగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీని వల్ల మనకు దేహదారుఢ్యం పెరుగుతుంది. యోగా చేయడం వల్ల ఇన్ని లాభాలుండటం వల్ల అందరు చేస్తున్నారు.
యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు మన ప్రధాని మోడీ కూడా తన వంతు సాయం అందిస్తున్నారు. అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా ప్రచారం కోసం కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయం. భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యోగాను విశ్వవ్యాప్తం చేయడం ఆయన ఆశయాల్లో భాగంగా యోగా నిలవడం గమనార్హం.