నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో డిజిటల్ చెల్లింపులకు మొగ్గుతున్నారు. ఫలితంగా క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. బీమా చెల్లింపుల నుంచి వివిధ రకాల వ్యాపార లావాదేవీలు వినియోగదారులకు ఊరట కలిగించనుంది. వీటికి త్వరలో బ్రేక్ పడనుంది. ఇక మీదట డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు అడ్డు చెప్పనుంది.
బీమా పాలసీలపై తీసుకున్న లోన్లు తిరిగి చెల్లింపు విదానంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో పేమెంట్ చేసే ఆప్షన్ నిలిపివేయాలని చూస్తోంది. జీవిత బీమా సంస్థలను ఉద్దేశించి ఆదేశాలు జారీ చేసింది. దీన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. దీంతో ఇక మీదట డిజిటల్ చెల్లింపులకు అడ్డుకట్ట వేయనుంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ యాక్ట్ 1999లోని సెక్షన్ 14 కింద ఈ ఆదేశాలు IRDIA జారీ చేసింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ కూడా నేసనల్ పెన్షన్ సిస్టమ్ టైర్ 2 ఖాతాలలో సబ్ స్రిప్షన్ లను కాంట్రిబ్యూషన్ కోసం క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు ఆమోదించకుండా ఆగస్టు 2022లో ప్రకటించింది.
అవసరం ఉన్నా లేకున్నా బీమా పాలసీలపై రుణాలు తీసుకుంటున్నట్లు ఐఆర్ డీఏఐ గుర్తించింది. దీంతో ఈ ప్రక్రియ పేపర్ లెస్ గా ఉండటంతో చాలా సులభంగా లోన్లు ఆమోదం పొందుతున్నట్లు తేల్చింది. దీంతో ఇక మీదట ఆ లోన్లు తీసుకునేందుకు అనుమతులు నిరాకరిస్తోంది. ఈ నిర్ణయంతో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.