pawan kalyan జనసేనాని పవన్ ఏపీలో గాలిదుమారం రేపుతున్నారు. ఆయన తన దూకుడైన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఇదే సమయంలో యువగళం పాదయాత్ర కొనసాగుతుండగా, పవన్ ధాటికి దీనికి అంతగా మైలేజీ రావడం లేదు. నిజానికైతే టీడీపీ అనుకూల మీడియా ఎంత గాలికొడుతున్నా, పవన్ కు వచ్చినంత ఇమేజ్ లోకేశ్ కురావడం లేదు. మొదటి విడుత పాదయాత్ర సమయంలో పవన్ కు ఇచ్చినంత స్పేస్ ను లోకేశ్ పాదయాత్రకు ఆయా పత్రికలు, చానళ్లు ఇవ్వలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం పవన్ చేస్తున్న అవేశపూరిత ప్రసంగాలనే అవి హైలెట్ చేయడం.
జనసేన చీఫ్ రెండో విడుత యాత్ర రెండు రోజుల క్రితం ఏపీలోని ఏలూరులో మొదలైంది. ఆయన తనదైన శైలిలో ఆవేశ పూరిత ప్రసంగం చేశారు. ఇప్పుడిదే ఏపీ వ్యాప్తంగా సంచలనమైంది. ఏదో ఒక చర్చ అయితే పవన్ ప్రసంగంపై మొదలైంది. నిజమెంత అనేకంటే జనానికి ఏదో మెసేజ్ ఇయ్యాలనే పవన్ ప్రయత్నం మాత్రం ఫలించింది. ఆయన దూకుడు శైలి ఇప్పుడు ఉపయోగపడుతున్నది. కానీ అదే దూకుడు టీడీపీ యువనేత లోకేశ్ లో కనిపించడం లేదు. అ సలు ఇప్పుడు కొన్ని పత్రికలు ఎంత గాలి కొడుతున్నా, దానిపై చర్చ మాత్రం రావడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ యాత్రకు మాత్రమే ఆ స్థాయిలో హైప్ వస్తున్నది. వైసీపీ దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడా పవన్ స్థాయిలో అది తగలడం లేదు. రానున్న రోజుల్లో పవన్ యాత్రను అడ్డుకునేందుకు కూడా వైసీపీ కి పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తు్న్నది. ఈ యాత్ర ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వానికి మరింత డ్యామేజ్ చేస్తారని ఇప్పటికే జగన్ కు మంత్రులు చెబుతున్నారని సమాచారం.
అయితే యువగళం పాదయాత్రం ఏపీలో బ్రహ్మండంగానే కొనసాగుతున్నది. ఇప్పటికే 2వేల కిలో మీటర్లు చేరుకున్నది. ఇదేం తక్కువ కాదు. లోకేశ్ నిజానికి పార్టీని అధికారంలోకి తేవడానికి కష్టపడుతున్నారు. మొదట్లో కొంత అధికార పార్టీల ఎమ్మెల్యేల అవినీతి అంటూ సెల్ఫీలతో హడావుడి చేసినా, పవన్ యాత్ర మొదలయ్యాక జనం దృష్టంతా అటు వైపు మళ్లింది. పవన్ యాత్రలకు జనం కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ముఖ్యంగా యువత బ్రహ్మరథం పడుతున్నారు. అయితే లోకేశ్ తన యాత్ర ద్వారా కొంత అలసిపోయినట్లుగా కనిపిస్తున్నది.
కొంత భుజం నొప్పి బాధిస్తున్నా ఆయన తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా పవన్ యాత్ర మొదలయ్యాక యువగళం యాత్రకు రావాల్సిన మైలేజీ మాత్రం రావడం లేదు. ఆ స్థాయిలో లోకేశ్ ప్రసంగాలు కూడా ఉండడం లేదు. పత్రికలు అంతగా ప్రాధాన్యం ఇస్తున్నా, ఒక్కసారిగా తెరపైకి పవన్ దూసుకొచ్చేశారు. ఆయన తన ఆవేశపూరిత ప్రసంగాలతో టాక్ ఆఫ్ ఏపీ గా మారారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.