వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన గొడ్డలి,డాక్యూమెంట్లను ఇప్పటి వరకు సీబీఐ స్వాధీనం చేసుకోలేదు..అలాంటప్పుడు హత్య కేసు విచారణ ఎప్పుడు పూర్తి అవుతుంది అనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉన్న దస్తగిరి చెప్పిన వివరాల ప్రకారం సీబీఐ విచారణ మొదలు పెట్టింది.. బెంగుళూరులో ఒక ల్యాండ్ సెటిల్ మెంట్లో ఎర్ర గంగిరెడ్డి కి వివేకానంద రెడ్డికి ఆర్థిక లావాదేవీలలో గొడవ జరిగిందని ఆ డబ్బులు వివేకానంద రెడ్డి గంగిరెడ్డికి ఇవ్వలేదని అందుకే వివేకానంద రెడ్డి పై పగ పెంచుకుని హత్యకు ప్లాన్ చేసాడని.. అందుకోసం తనకు 5 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడన్నారు.
సీబీఐ విచారణలో అసలు బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ జరగలేదని తేలింది.. ఐతే వివేకానంద రెడ్డిని మర్డర్ ఎందుకోసం చేశారు అనే కొత్తకోణం బయటపడింది.. వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో భార్య షమిమ్ వివరాలు కీలకం కానున్నాయి..
మరీ వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది.. ఆరోజు రాత్రి ఎం జరిగింది.. హత్యకు వినియోగించిన గొడ్డలి ఏమైంది.. వివేకానంద రెడ్డి హత్యకు ముందు ఒక డాక్యూమెంట్ రాసాడని ప్రచారం జరుగుతుంది.. ఆ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంది.. సునీత ఆరోపణలు చేస్తున్నట్టు వైఎస్ అవినాష్ రెడ్డి ఆ డాక్యుమెంట్లను దాచిపెట్టారా… అవినాష్ రెడ్డి చెబుతున్నట్లు సునీత దగ్గర ఉన్నాయా..తేలాలి అంటే మరీ కొన్ని రోజులు వేచి ఉండాల్సింది..
దేశంలోనే పెద్ద ఇన్వెస్టిగేషన్ సంస్థ అయిన సీబీఐ ఇంత వరకు డాక్యుమెంట్లను, హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది.