Mahesh Babu VS Allu Arjun : : ఇటు క్లాసు, అటు మాస్ ను బాగా వాడుకొని ప్రేక్షకుల నుంచి అభిమానం గుంజడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పంతానే వేరు. ఆయన చేసిన ప్రతీ సినిమా ఒక్కో డిఫరెంట్.. డైరెక్టర్ గానే కాకుండా డైలాగ్స్ పరంగా కూడా ఆయన గ్రేట్ అనే చెప్పాలి. అందుకే ఆయనకు మాటల మాంత్రికుడు అనే గుర్తింపు దక్కింది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇద్దరు హీరోలు వేరైనా మాస్ ను పండించడంలో ఎవరి స్టయిల్ వారిది. కానీ డైరెక్టర్ ఒక్కడే కావడంతో ఎవరితో బాగా చేయించాడనే టాక్ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ‘అల వైకుంఠపురం’లో. కామెడీ నుంచి మాస్ వరకూ ప్రతీ సీన్ హైలెట్ గా చిత్రీకరించారు త్రివిక్రమ్. ఇక ఆయన డైరెక్షన్ లోనే రీసెంట్ గా వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ ఈ మూవీలో మహేశ్ బాబు హీరోగా చేస్తున్నాడు. అయితే అల వైకుంఠపురం, గుంటూరు కారం మాస్ ను కంపేర్ చేస్తున్నారు ఆడియన్స్.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న (మే 31) విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. ప్రోమోలో ఫైట్ సీన్స్ లో జానపద పాటను ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. త్రివిక్రమ్ తన గత చిత్రం అల వైకుంఠపురములో ప్రీ క్లైమాక్స్లో ఇలాంటి పాటనే ప్రయోగించగా ప్రేక్షకుల నుంచి థియేటర్స్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘సిత్తరాల సిరపడూ.. సిత్తరాల సిరపడు..’ పాట జనం నోట్లో ఇప్పటికీ నానుతూనే ఉంది. ఇటీవల గుంటూరు కారం గిమ్స్ లో కూడా మహేశ్ బాబుతో ఇలాంటి జానపదగేయాన్నే అంటించాడు త్రివిక్రమ్. ఈ రెండింటినీ పోలుస్తున్నారు నెటిజన్లు. ఓవరాల్ గా గుంటూరు కారం ఫస్ట్ గ్లింప్స్ సినిమా ప్రమోషన్ కు పర్ఫెక్ట్ స్టార్ట్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత మహేశ్ బాబు నుంచి వస్తున్న పర్ఫెక్ట్ మాస్ సినిమా అని తెలుస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఎస్ రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం 13 జనవరి, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ReplyForward
|