Bro పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆనందం, విషాదం రెండు ఒకేసారి కలిసి రానున్నాయి. దాదాపు సంవత్సరానికి పైగా (చివరి చిత్రం భీమ్లా నాయక్) తెరమీద తన అభిమాన నటుడిని చూసుకోని ఫ్యాన్స్ బ్రో: ది అవతార్ రూపంలో ఇప్పుడు వారి ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో బ్రోతో పాటు ‘హరిహర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నింటిలో సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ ఈ నెల విడుదల కాబోతోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ స్ర్కీన్ ను పంచుకున్నాడు. తమిళంలో బాక్సాఫీస్ హిట్ సాధించిన చిత్రంను సముద్రఖని రీమేక్ చేయనున్నారు.
ఇవన్నీ పక్కన ఉంచితే ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ ను తెరమీద కంటే నేరుగా చూసేందుకు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటారు కాబట్టి ఆయనను చూడవచ్చు అంటూ అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఆయన ప్రమోషన్ కు వచ్చేలా కనిపించడం లేదంటూ టాలీవుడ్ లో టాక్ మొదలైంది. దాదాపు సంవత్సరంన్నర తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లాంటి ఈవెంట్లలో ఆయన పాల్గొంటే సినిమాకు బాగా హైప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకైతే పవన్ కళ్యాణ్ వీటిలో పాల్గొనేట్లు కనిపించడం లేదు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ప్రచారం, యాత్రల్లో బిజీగా ఉంటున్నారు. తన నిర్మాతలు, దర్శకులతో కూడా ఎన్నికల షెడ్యూల్ చూసుకొని డేట్స్ అడ్జస్ట్ చేయాలని సూచించారట. ఈ మేరకు డైరెక్టర్లు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారట. ముందుగా సముద్రఖని సినిమా బ్రో కంప్లీట్ అయ్యింది. ఇక ఎన్నికల తర్వాతనే మిగతా సినిమాలు చేయాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అయితే మిగతా రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా బడ్జెట్ పరంగా చిన్న చిత్రం హిట్, ప్లాప్ ఇప్పుడే ఊహించకున్నా. బ్రో ప్రమోషన్ కు మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చేలా కనిపించడం లేదని జనసేన వర్గాలతో పాటు మూవీ మేకర్స్ నుంచి కూడా లీకులు వినిపిస్తున్నాయి.