Pawan kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమరంలో ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గాల పరిస్థితిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా స్పస్టత ఇస్తున్నారు. మూడో విడత యాత్రను మొదలు పెట్టారు. వారాహి యాత్రలో భాగంగా విశాఖ జిల్లా గాజువాకలో కొనసాగుతోంది. ఇక్కడ పవన్ కు ఘనస్వాగతం లభించింది. ప్రజలు భారీగా హాజరయ్యారు.
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక నుంచే బరిలో నిలిచారు. జగన్ పై ఉన్న అభిమానంతో తనకు ఓటేయలేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. గాజువాక సీటు జనసేనదే అని కామెంట్ చేస్తున్నారు. తాను కాకపోయినా పార్టీ నుంచి ఎవరో ఒకరు నిలబెడతామని చెప్పారు. భీమవరం నుంచి పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయారు.
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. పిఠాపురం, కాకినాడ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీకి పవన్ కల్యాణ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి నాటికి తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై పవన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రమంతా చుట్టిన పవన్ కల్యాణ్ ఈ సారి అధికారం తనదే అనే ధీమాతో ఉన్నారు.
పవన్ కు మద్దతు కూడా పెరుగుతోంది. ఏపీలో అధికార మార్పిడి తప్పనిసరని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీని తుదముట్టించాలని ప్లాన్ చేస్తున్నారు. జనసేన అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అభ్యర్థులను ముందే ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు ఎలా మారతాయో అనే ఆలోచన సగటు ఓటరు మదిలో మెదులుతోంది.