Pawan & Mahesh Babu :
సినిమా పరిశ్రమలో అగ్రహీరోలంటే పవన్ కల్యాణ్, మహేష్ బాబులే. వీరిద్దరు ఎవరికి వారే పోటీ. వారికి వారే సాటి. దీంతో వారి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులకు మహా ఇష్టమే. దీంతో వారి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం సహజమే. వీరి మధ్య స్నేహం కూడా అలాగే ఉంటుంది. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వారి సహకారం ఉంటుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దీంతో సినిమా బ్రహ్మాండమైన హిట్ గా నిలిచింది.
ఇప్పుడు మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారంలో అలాంటి ప్రయోగమే చేయనున్నారట. ఇందులో వాయిస్ ఓవర్ కు చాలా ప్రాధాన్యముందట. అందుకే పవన్ కల్యాణ్ తో ఆ పని చేయించాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని సినిమా పరిశ్రమలో టాక్ వస్తోంది. ఇదే నిజమైతే ప్రేక్షకుల సంతోషాలకు అవధులు ఉండవు.
మరోవైపు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాలో మహేష్ బాబుకు అతిథి పాత్ర ఇచ్చే అవకాశం ఉందని ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇలా అగ్రహీరోల మధ్య సమన్వయంతో వారి మధ్య స్నేహం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నారు. వీరిద్దరు ఎప్పుడు కూడా ఒకే స్క్రీన్ పై కనిపించలేదు. సుజిత్ ఆ పనిచేస్తే ప్రేక్షకుల కల కూడా నెరవేరుతుంది.
రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవంటారు. కానీ వీరిద్దరు సమ ఉజ్జీలైన వారి పనులు వారు చేసుకుంటూ పోతారు. ఎవరి గురించి కూడా పట్టించుకోరు. ఎలాంటి ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వరు. ఈనేపథ్యంలో వారిద్దరు కలిసి నటిస్తే చూడాలని అభిమానుల కోరిక తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి. ఆ పని ఎవరు చేస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతోంది.