ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అనేస్తున్నాడు అక్కినేని కుర్రాడు అఖిల్. ఏజెంట్ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు . స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు అఖిల్. బాడీ బిల్డప్కే ఏడాది సమయాన్ని తీసుకున్నాడు. త్వరలో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ , ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో… మేకర్స్ కన్ను అయ్యగారిపై పడింది.
ఏజెంట్ ట్రైలర్ లో అఖిల్ యాక్షన్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో బడా నిర్మాణ సంస్థలు పోటిపడుతున్నాయి. ఏజెంట్ తర్వాత అక్కినేని కుర్రాడు నెక్ట్స్ మూవీపై సస్పెన్స్ కొనసాగుతున్నా… అక్కినేని వారసుడితో సినిమాలు చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే దసరాతో హిట్ కొట్టిన .. శ్రీకాంత్ ఓదెల తో మూవీ ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ అందులో క్లారిటీ లేదు. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
యూవీ క్రియేషన్స్ వారు అఖిల్ ని లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అఖిల్ లైనప్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటి ఈ భారీ నిర్మాణ సంస్థ నుంచి అయితే ఉండనుందని తెలుస్తోంది. ఇదే కాక కెజియఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు.. రాబోయే కాలంలో ఏకంగా మూడు వేల కోట్లు సినిమాల కోసం ఖర్చు చేయబోతున్నారు. ఇప్పటికే సాలిడ్ లైనప్ సెట్ చేసే పనిలో ఉంది. వారిలో అక్కినేని యంగ్ హీరో అఖిల్తో హోంబలే వారు ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ మాత్రం.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రజెంట్ ఏజెంట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అఖిల్. ఈ మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటే… ఇక అఖిల్ ఆపడం ఎవరి వల్ల కాదని తెలుస్తోంది