మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్.. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇటీవలె స్క్రిప్టు రాయడం స్టార్ట్ చేశారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ రోజు రోజుకి ఈ సినిమా పై వస్తున్న హైప్ చూసి.. ఫ్యాన్స్కు పిచ్చెక్కిపోతోంది. మిగతా హీరోల ఫ్యాన్స్ అయితే.. ఇదేం హైప్రా బాబు.. అంటూ మహేష్ ఫ్యాన్స్ను అడుగుతున్నారు. రాజమౌళి నోటి నుంచి SSMB 29 గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. చెప్పిందే చెప్పినా కూడా మహేష్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్ సెన్సేషనల్ గా మారుతున్నాయి.
నిజం చెప్పాలంటే.. మహేశ్బాబు రాజమౌళి కాంబోలో రానున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ అడ్వెంచర్ సినిమా రాబోతున్నట్లు జక్కన్న ఆల్రెడీ హింట్ ఇచ్చాడు. పైగా జక్కన్న ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోమాగ్జిమమ్ పురాణాలను బేస్ చేసుకుని చాలా పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తుంటారు. అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29 గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు రోల్ లార్డ్ హనుమాన్ ప్రేరణతో రాశారని గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునట్లు మహేశ్బాబు పాత్ర హనుమాన్ స్ఫూర్తితో ఉండదని… అలానే ఏ పౌరాణిక పాత్రతో పోలి ఉండని చెప్పేశాడు. అయితే ఎవరో కావాలని ఈ రూమర్ ను పుట్టించారని… త్వరలో సినిమాకు సంబంధించి అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పాడు.
ఇదిలా ఉంటే పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ను ఫైనల్గా రాజమౌళి సెప్టెంబర్ లో సెట్స్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ కోసం ఓ హాలీవుడ్ టీమ్ని హైర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ సినిమా దగ్గర మంచి పట్టు ఉన్న వాళ్ళని.. ప్రస్తుతం వారితో వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. దాంతో #SSMB29ని ట్రెండ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. పైగా పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్గా రూపొందనున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీన్ని మూడు పార్టులుగా దర్శకధీరుడు తెరకెక్కించబోతున్నారని మహేశ్ ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అవుతోంది.