33.7 C
India
Tuesday, May 14, 2024
More

    Amaravathi : అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందేనా?

    Date:

    Amaravathi 
    Amaravathi 
    Amaravathi  ఏపీ ప్రభుత్వానికి నిధులు కేటాయించేందుకు కేంద్రం  ససేమిరా అంటోంది. ఇప్పటికే ఆమోదించిన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చామని, ఇకపై మరిన్ని నిధులు మాత్రం ఇవ్వలేని తేల్చిచెబుతున్నది. గతంలో అమరావతిలో  ప్రతిపాదించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ.930 కోట్లతో మొత్తం 19 ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో రూ.627 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు పూర్తి కాగా.. మరో ఏడు ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.
    వీటికి కేంద్రం తరఫున ఇవ్వాల్సిన వాటా నిధుల్ని ఇచ్చేసినట్లు పార్లమెంటులో కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. అలాగే రూ.302.86 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు ప్రస్తుతం నడుస్తున్నట్లు తెలిపారు. వీటికి నిధుల కేటాయింపు ఎలాగో ఉంటుంది. అయితే మరిన్ని నిధుల కేటాయింపు విషయంలో మాత్రం అమరావతి స్మార్ట్ సిటీకి కేంద్రం మొండిచేయి చూపుతున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేశామని, మరిన్ని నిధులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం పార్లమెంట్లో తేల్చిచెప్పేసింది.
    దీంతో అమరావతికి మద్దతుగా ఉంటామంటున్న బీజేపీ .. తమ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు ఇప్పించే పరిస్ధితి లేదని తేలిపోయింది. ఇప్పటికే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత అమరావతిలో పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కేంద్రం నిధులిస్తున్న ప్రాజెక్టులకూ రాష్ట్రవాటా నిధుల విడుదల చేయడం లేదు. దీంతో ఇక్కడ కొత్త ప్రాజెక్టులు వచ్చేలా లేవు. సుప్రీంకోర్టులో అమరావతి విషయం తేలే వరకూ ఈ ప్రాజెక్టులు కానీ నిధులు కానీ ఇచ్చిపుచ్చుకునే పరిస్దితి కనిపించడం లేదు. దీంతో ఇక్కడి రైతులు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఏదైనా ప్రకటన చేద్దామన్నా సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రభుత్వాలకు అడ్డుగా మారబోతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Gaza : గాజాలో ఐరాస వాహనంపై దాడి.. భారతీయుడి మృతి

    Gaza : గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి...

    Theatre-OTT : థియేటర్.. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయా?

    Theatre-OTT : ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్ కు...

    GT Vs KKR : గుజరాత్ కు చావో రేవో.. కోల్ కతా ఫస్ట్ ప్లేస్ కోసం..

    GT Vs KKR : గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    AP Inter Results : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

    AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్...