Shreyas Iyer : ఇటీవల కాలంలో టీమిండియాలో మంచి ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ గుర్తింపు పొందుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచుల్లో తన బ్యాట్ ఝళిపించాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి తానేమిటో నిరూపించుకున్నాడు. అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానంగా తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ జట్టులో తన స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ కు ముందు స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడుతున్న మొహాలీ, ఇండోర్ మ్యాచ్ లకు కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, హార్థిక్ పాండ్యా దూరంగా ఉన్నారు. దీంతో వన్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు దిగాడు. తొలి మ్యాచ్ లో 3 పరుగులకే రనౌట్ కాగా రెండో వన్డేలో అద్భుతంగా రాణించాడు.
సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 11 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ గా అవార్డు గెలుచుకున్నాడు. ఆటలో అద్భుతమైన అనుభూతి పొందాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడాను. అందుకే అద్భుతమైన ఇన్నింగ్స్ సొంతం చేసుకున్నాను. గాయం ఉన్నా లక్ష్యాన్ని మరువలేదు. జట్టు ప్రయోజనాల కోసం ఎంతో అద్బుతమైన ఆటను కొనసాగించానన్నాడు.
టీమిండియా ఆటగాళ్లలో కోహ్లి ఓ అద్భుతమైన ఆటగాడు. అతడి స్థానం నెంబర్ త్రీ. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడని అంటున్నారు. కానీ దానికి నేను ఎప్పుడు సిద్ధంగా లేను అంటాడు అయ్యర్. కానీ బుధవారం నాటి మూడో వన్డే మ్యాచ్ లో రోహిత్, కోహ్లి అందుబాటులో ఉండనున్నారు. దీంతో శ్రేయస్ తాను కోహ్లి స్థానం కావాలని కోరుకోవడం లేదని బదులిచ్చాడు.