Elon Musk : టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే కుబేరుల్లో ఒకరు. ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేసి పలు మార్పులు చేశారు. మస్క్ కు ఓ షాక్ తగిలింది. ఆయన కంపెనీల్లో పనిచేసే వారిని తొలగించడంతో వారు నస్టపరిహారం కోసం కోర్టుకు ఎక్కారు. దీంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరించడం సంచలనం కలిగించింది.
భారత సంతతికి చెందిన మాజీ ఎక్స్ సీఈవో అనురాగ్ అగర్వాల్, పాలసీ హెడ్ విజయ గద్దె ఇతర ఉద్యోగులు 1.1 మిలియన్ డాలర్ల లీగల్ ఫీజులు గెలుచుకోవడం గమనార్హం. ఎక్స్ లో వారు పనిచేసే సమయంలో సంస్థ నిబంధనలను ఉల్లంఘించి పనులు చేయడం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు ఎదురయ్యే సమస్యలు తొలగించుకోవాలంటే సంస్థ నుంచి డబ్బులు కావాలని కోర్టుకెక్కారు.
వారి వాదనలు విన్న కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వారికి 1.1 మిలియన్ డాలర్ల నస్ట పరిహారం ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేయడంతో మస్క్ కష్టాల్లో పడ్డారు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే బెంగలో ఉన్నారు. కానీ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మస్క్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
మస్క్ ట్విట్టర్ ను పలు మార్పులు చేస్తున్నారు. సంస్థలో పనిచేసే చాలా మంది సిబ్బందిని తొలగించారు. దీంతో వారు రోడ్డున పడ్డారు. ఆయన నియంత నిర్ణయాల కారణంగా చాలా మంది కష్టాలు పడుతున్నారు. ఆయనకు నచ్చకపోవడం వల్లే ఇలాంటి వాదనలు వస్తున్నాయి.