- రాజీనామా చేసిన హస్తం పార్టీ ఎమ్మెల్యే
Ayodhya Rama Mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో పార్టీ వైఖరి నచ్చక గుజరాత్ హస్తం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ శంకర్ చౌధరికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
అదేవిధంగా పార్టీ కూడా గుడ్బై చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో 25 ఏండ్లపాటు కొనసాగానని, నేడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండటంతో దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వేడుక జరుపుకుంటున్నారని చెప్పారు.
రాముల వారు ఎప్పుడు కోలువుదీరుతారా అని అంతా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. కానీ వేడుకలకు ఆ పార్టీ ఎందుకు దూరంగా ఉంటుందనే విషయం తనకు అర్థంకాలేదన్నారు.
గుజరాతీలుగా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా చేసే పనులకు తాము మద్దతుగా ఉండాలని, అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల తాము ఆ పని చేయలేకపోతున్నామని వెల్లడించారు. కాగా, చవ్దా రాజీనామాతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం 15కు పడిపోయింది.
ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆయన ఆనంద్ జిల్లాలోని ఖంబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.