Jagan Yatra : ఈనెల 27వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:56 గంటలకు సీఎం జగ న్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపుల పాయకు చేరుకుంటారు.
అక్కడ వైయస్సార్ ఘాట్ వద్ద ప్రార్ధనలు నిర్వ హించిన అనంతరం నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు బయలుదేరుతారు. వేం పల్లి, వీరపునాయుని పల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసం గిస్తారు. అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కు వయా దువ్వూరు, చాగలమర్రి, కు చేరుకుని రాత్రికి బస చేస్తారు..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మో హన్ రెడ్డి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదట ఇడుపులపాయకు వెళ్లి అక్కడ నివాళి అర్పించిన తర్వాత ఈ యాత్రను ప్రారంభిస్తారు. మొదట కడప జిల్లాలో పలు ప్రాంతాలను తిరిగిన తర్వాత అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు చేరుకుంటారు.