Team India Victory : టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ లో సూపర్ 8 తొలి మ్యాచ్ లో ఇండియా అఫ్గానిస్తాన్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లిలు మరో సారి భారీ స్కోర్లు చేయకుండానే నిరాశ పరచగా.. పంత్ మరో సారి 11 బంతుల్లోనే 20 పరుగులు బాది అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబె లు ఇన్సింగ్స్ ను గాడిలో పెట్టారు. సూర్య కుమార్ యాదవ్ 27 బంతుల్లోనే 53 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సూర్య అవుటయ్యాడు. చివర్లో హర్దిక్ పాండ్యా 32 పరుగులతో రాణించగా.. ఇండియా 181 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు అందుకుంది. రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫజూల్ ఫారుఖీ మరో సారి మూడు వికెట్లు తీసి టోర్నమెంట్ టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ మొదటి ఓవర్ లోనే అర్షదీప్ బౌలింగ్ లో ఒక సిక్సు, ఫోరు బాదాడు. గుర్బాజ్ ను జస్ ప్రీత్ బుమ్రా వెనక్కి పంపాడు. స్పిన్ కు సహకరించిన పిచ్ పై జస్ ప్రీత్ బుమ్రా, అర్షధీప్ చెలరేగి బౌలింగ్ చేశారు. ఇద్దరు కలిసి ఆరు వికెట్లు తీశారు. ఒక హర్దిక్ పాండ్యా మినహాయించి మిగతా అందరూ బౌలర్లు వికెట్లు తీశారు. అఫ్గానిస్తాన్ ఏ దశలోనూ టార్గెట్ ను ఛేజ్ చేసేలా కనిపించలేదు.
అయినా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.సూపర్ 8 లో విజయం సాధించిన భారత్ మరో రెండు మ్యాచులు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇందులో రెండు గెలిస్తే నేరుగా సెమీస్ కు చేరుతుంది. లేకపోతే ఒకటి గెలిస్తే మిగతా టీంల నెట్ రన్ రేట్ లతో పోటీ పడాల్సి వస్తుంది.