AP CID Notices : టిడిపి నేత నారా లోకేష్ కు ఏపీ సిఐడి అధికా రులు నోటీసులు జారీ చేశారు. రెడ్ బుక్ పేరుతో ఆయన పోలీసు లను బెదిరిస్తున్నారని సిఐడి అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు లోకేష్ కు సిఐడి అధికారులు వాట్సాప్ లో నోటీసులను పంపించారు. నోటీసు అందుకున్నట్లు లోకేష్ సమాధానం కూడా ఇచ్చా రు. కాగా రెడ్ బుక్ అంశం పై కేసు విచారణను ఎసిబి కోర్టు ఇప్పటికే జనవరి 9 వ తేదీ కి వాయిదా వేసింది.
సిఐడి అధికారుల నోటీసుల నేపథ్యంలో లోకేష్ ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో టిడిపి ఏ కార్యక్రమం చేపట్టిన పోలీసులు అడ్డుకొనే వారు. తప్పని తెలిసిన రాజ కీయ ఒత్తిడితో పోలీసులు వైసీపీ అనుకూ లంగా పనిచేయాల్సి వచ్చింది. దీంతో నారా లోకేష్ నిజా యితీగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు అధికార పార్టీకి ఎలా తొత్తులుగా మారతారని పలు సందర్భాల్లో పోలీసులపై మండిపడ్డారు.