దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయో ధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అన్ని రంగాలలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమ నుం చి కూడా చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంప తులు, రామ్ చరణ్ అయోధ్యలో సందడి చేశారు.
అయోధ్యలో ఆలయ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామీలికి ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో వారికి కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్ తో రిలయన్స్ అధిపతుల్లో ఒకరైన అనిల్ అంబానీ చాలాసేపు ముచ్చటించారు. ఈ వీడియోలు.. చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, నాటి పరుగుల రాణి పీటీ ఉష ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతోంది. అంతకుముందు విమానాశ్రయంలో చిరంజీవి, రామ్ చరణ్ తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
RRR సినిమాతో రామ్ చరణ్ నార్త్ లో కూడా బాగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా చరణ్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ వీడియోలో చిరంజీవి కంటే కూడా చరణ్ ని గుర్తించి చరణ్ తండ్రి అని చెప్పడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇది కదా చరణ్ క్రేజ్ అని, అయోధ్యలో కూడా చరణ్ క్రేజ్ మాములుగా లేదని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.