Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కొన్ని సంవత్సరాలపాటు కటోర మైన దీక్షతో ఆ విగ్రహాన్ని శిల్పి తయారు చేశారు. ఇలా రూపుదిద్దుకున్న బాల రాముడిని అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేశారు.
రామ మందిరం లో ఉన్న రాముడు విగ్రహం లాగే తమ కుమారుడిని చూసుకోవాల నుకున్నారేమో ఆ తల్లిదండ్రులు. ఆలోచన వచ్చిందే తరువాయి వెంటనే రాముడి విగ్రహం లాగానే తమ తొమ్మిదేళ్ల కుమారుడికి పెయింటింగ్ వేసి అచ్చు అయోధ్య రాముడు విగ్రహం పోలినట్టుగా తయారు చేశారు. మొదట చూసిన వారందరూ కూడా అయోధ్యలో ఉన్న బాల రాముడే అనుకున్నారు.
కానీ రాముడి స్థానంలో ఉన్నది ఓ బాలుడు అని ఎవరు కనిపెట్టలేకపోయారు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నది తమ కుమారుడని చెప్పేవరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అక్కడ ఉన్నది నిజం గా బాలుడు అని తెలుసుకున్న నెటిజెన్లు ఆశ్చర్య పోతున్నారు. శ్రీరాముడు పై ఉన్న భక్తిని తల్లిదండ్రులు ఇలా చాటుకున్నారు. ప్రస్తుతం మీ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.