కోనసీమ జిల్లాలో ఓ దళిత బాలికకు అవమానం జరిగింది. ఆపదలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తన వక్రబుద్దిని చూపించింది అక్కడ పనిచేస్తున్న నర్సు. కాలు నొప్పితో బాధపడుతున్న దళిత బాలికను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడున్న నర్సు చిన్నారిని చేతితో కాకుండా కాలితో తొక్కి పరీక్షించడంతో బాలిక తాత ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కుటుంబ సభ్యులు చేప్పిన వివరాల ప్రకారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కరరావు అనే వ్యక్తి తన పదేళ్ల మనవరాలు గుత్తాల శ్రీదేవిని ఆదివారం డిసెంబర్ 17 ఉదయం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. గత కొంతకాలంగా కాలు నొప్పితో బాధపడుతున్న చిన్నారిని అక్కడ విధుల్లో ఉన్న నర్సు మణికుమారి పరీక్షించింది.
అయితే ఆమె చేతితో కాకుండా చిన్నారి కాలును తన కాలితో తొక్కి చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించింది. నర్సు తీరుకు భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చేవారిని చిన్నచూపు చూడొద్ద, బాధ్యతగా మసలు కోవాలని హెచ్చరించారు. అధికారులకు ఫిర్యాదు చేస్తానని బాస్కరరావు చెప్పడంతో నర్సు మణికుమారి క్షమాపణ చెప్పింది. ఈ ఘటనపై అదే ఆసుపత్రిలోని డాక్టర్ లిఖితను అడగగా.. సదరు నర్సు డిప్యుటేషన్పై ఆసుపత్రిలో పనిచే స్తోందని అన్నారు. ఇకపై ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటామని అనడంతో చిన్నారి తాత భాస్కరరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.