– శిరోముండనం కేసులో కోర్టు తీర్పు
Thota Trimurthulu : 1996లో జరిగిన శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసులో ఎమ్మెల్సీ త్రిమూర్తులుతో పాటు మరో ఆరుగురు నిందితులకు 18 నెలల జైలుశిక్షతో పాటు రూ. 2.50 లక్షల జరిమానా న్యాయమూర్తి విధించారు. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన 1996 డిసెంబర్ 29న జరిగింది. 18 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసు 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.