తెలంగాణ:బీఆర్ఎస్ను బొందపెట్టి తీరతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్య లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ లాంటోళ్లను చాలామందిని చూశా మని వ్యాఖ్యా నించారు. ఈ క్రమంలో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పై తీవ్రస్థాయిలో విమర్శలు గు ప్పించారు. జనవరి నెల కరెంట్బిల్లులు ఎవరూ కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతున బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. ముందు 100 రోజుల్లో ఇ చ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్ సీఎం రేవంత్కు చురకలు అంటించారు. అహం కారం తో మాట్లాడిన రవేంత్రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిం దని.. రెండున్నర దశాబ్దాలు నిలబడి రేవంత్ లాంటోళ్లను మట్టి కరిపించిందని అన్నారాయన. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్? తెలంగాణ తెచ్చినందుకా?.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హమీల్ని ప్రశ్నిస్తునందుకా?’’ కేటీఆర్ నిలదీశారు.