AP Govt Advisors : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి గుడ్ న్యూస్ చెప్పారు. సజ్జల సహా నలుగురు సలహాదారుల పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో సజ్జలతోపాటు జీవీడీ కృష్ణమోహన్.. అజయ్ కల్లాం.. శామ్యూల్ ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం వీరిని ముందుగా మూడేళ్ల పదవీకాలంలో నియమించింది. ఆ తర్వాత అందరికీ ఒకే పదవీకాలం ఉండాలంటూ రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం మచ్చటగా మూడోసారి కూడా నలుగురు సలహాదారుల పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.