KTR స్వేదపత్ర పవర్పాయింట్ ప్రజెంటేషన్ పై కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్లగణేష్ మండిపడ్డారు. పవర్ లేని వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. మాాట్లాడితే గత పాలకులు ఏమి చేశారు..అంతా మేము చేశామని మీరు ప్రతి సారి నొక్కి చెప్పడం విని మేము విసిగిపో యామని బండ్లగణేష్ అన్నారు. తెలంగాణలో ప్రజల జీవన విదానంలోఎంత వెనుకబ డిపోయారో మీరు ఎంత ముందుకు వెళ్లారో మేము చెప్పాము కాబట్టే ప్రజలు మా పై నమ్మకం పెట్టారు కాబట్టి మాకు అధికా రం ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధవంతంగా పాలన సాగిస్తుందని జీర్ణించుకోలేక పోతు న్నారని ఆయన ప్రశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రభుత్వం అధికారంలోకి రావడం 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఉండటంతో మీకు నిద్రపట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు. మీ పాలన చూసి విసిగిపోయారు కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని ప్రజలకు ఇఛ్చిన ప్రతి ఓక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని బండ్లగణేష్ అన్నారు.
Breaking News