Bandla Ganesh : బండ్ల గణేష్ అంటే తెలియని వారు లేరు.. ఈయన నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక ఈయన వీటి కంటే ఎక్కువ వివాదాలతోనే పాపులర్ అయ్యాడు.. ఎప్పుడు ట్విట్టర్ లో బండ్ల గణేష్ ఆయనకు సంబంధం ఉన్న విషయాలే కాదు.. లేని విషయాలు కూడా ట్వీట్ చేస్తూ వివాదానికి తెర తీస్తుంటాడు..
ఇక ఈ మధ్యనే గురూజీ అంటూ త్రివిక్రమ్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. పవన్ నుండి తనను విడదీసాడు అంటూ ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వగా ఈ ఇష్యును పవన్ కళ్యాణ్ క్లియర్ చేసారంటూ వార్తలు వచ్చాయి.. ఇక ఇప్పుడు రవితేజ ఇష్యు గురించి నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..
రవితేజను మోసం చేసాడని బండ్ల గణేష్ స్వయంగా చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. రవితేజకు ఒకప్పుడు బండ్ల గణేష్ 25 ఎకరాల ల్యాండ్ అమ్మారట.. కానీ ఆ వెంటనే మిగతా 30 ఎకరాల ల్యాండ్ ను వేరే ఆయన కొంటానని రవితేజకు 2అమ్మిన 0 ఎకరాల ల్యాండ్ కూడా తనకే కావాలని అడిగారట..
దీంతో బండ్ల గణేష్ చేసేదేమీ లేక రవితేజకు అమ్మిన ల్యాండ్ కోసం ఇది గవర్నమెంట్ ఇష్యులో ఉందని మొత్తం ఇచ్చేద్దాం అని చెప్పి ఒప్పించారట.. అలా ఆ ల్యాండ్ విషయంలో తన కోసం అబద్ధం చెప్పి రవితేజను మోసం చేసానని బండ్లన్న వాపోతున్నాడు. మాస్ రాజా సినిమాకు తనకు 5 కోట్ల వరకు లాభాలు వచ్చాయని.. ఎప్పటికైనా ఈయన ఋణం తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు..