Gottipalla : వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో టీడీపీ మద్దతుదారులపై దాడులు పెరిగిపోయాయి. పోలీసులు అండతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో టీడీపీ నేత బాబు ఇంటిపై వైసీపీ మూకలు దాడులకు దిగడం సంచలనంగా మారింది. పథకం ప్రకారం గొడ్డలితో బాబుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో బాబుకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తలపై కర్రలు.. రాళ్లతో వైసీపీ మూకలు దాడులకు పాల్పడటంతో భయాందోళనకు గురైన టీడీపీ నేతలు పరుగులు పెట్టారు.
ఈ దాడిలో బాబు ఇల్లు పూర్తిగా ధ్వంసంగా కాగా బంగారం.. నగదును ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాగా వైసీపీ నేతలు టీడీపీ మద్దతుదారులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. సుమారు గంటపాటు గొట్టిపాళ్ల రణరణంగా మారింది. వైసీపీ దాడులతో గొట్టిపాళ్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననన్న భయాందోళన అందరిలో నెలకొంది.