UP మద్యం మత్తులో అమ్మాయిలు వీరంగం సృష్టించారు. బాగా మద్యం తాగి గొడవకు దిగారు. మందు తాగి హంగామా చేశారు. రోడ్డు మీద కారు ఆపి వీరంగం సృష్టించారు. వారి అల్లరి శృతి మించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నచ్చజెప్పినా వినలేదు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఇటీవల కాలంలో ఆడవారు తాగడం కూడా ఓ ఫ్యాషన్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లో జరిగిన తాజా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. మహిళా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మద్యం మత్తులో వారు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం అమ్మాయిలు కూడా మద్యం మత్తులో జోగుతున్నారు. అబ్బాయిలతో పాటు తాగుతున్నారు. తాగుబోతులు చేసినట్లు గొడవలకు దిగుతున్నారు. నడిరోడ్డుపై ప్రయాణికులపై విరుచుకుపడటంతో ఇబ్బందులకు గురయ్యారు. అమ్మాయిలు తాగి ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. మద్యం తాగి గొడవలకు దిగే వరకు వెళ్లడం వివాదాస్పదంగా మారుతోంది.
ఇన్నాళ్లు అబ్బాయిలే తాగి గొడవలు చేసే వారు. ఇక అమ్మాయిల వంతు కూడా వచ్చింది. ఇలా తెగ తాగి ఇబ్బందులు సృష్టించడంతో అందరు అవాక్కయ్యారు. ఆడపిల్లలు ఇంత దారుణానికి ఒడిగట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. యూపీలో ఇలాంటి ఘటనలు సాధారణమే. దీంతో ఈ ఘటన యూపీలో గందరగోళం కలిగిస్తోంది. నాగరికత ముసుగులో యువత రెచ్చిపోయి ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.