తమ కంపెనీ నుంచి వస్తున్న అన్ని మోడల్ కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. ధరలపై 0.45% పెంపును తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో ఆల్టో నుంచి ఇన్ విక్టో వరకు అనేక మోడల్ కారులను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ 3.54 లక్షల నుంచి ప్రారంభమై 28.42 లక్షల వరకు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నిర్వహణ వ్యయాలు ముడి సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని కొంతవరకు వినియో గదారులకు బదిలీ చేయక తప్పడం లేదని గత ఏడాది నవంబర్ లో కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో 2024 జనవరి నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా దాన్ని అమల్లోకి కూడా తీసుకు వచ్చింది