Manipur Violence : జాతుల మధ్య వైరంతో మణిపూర్ అట్టుడుకుతోంది. మరోసారి హింస చెలరేగడంతో 9 మంది దుర్మరణం పాలుకాగా చాలామంది గాయపడ్డారు. ఖమెన్లోక్ ప్రాంతంలో గడిచిన రాత్రి జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించినట్టు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు సమచారం.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మణిపూర్ లో నెలరోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు కేంద్రం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం రావడం లేదు. దీంతో కేంద్రం.. రాష్ట్రాల్లోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.