ముంబై: సముద్ర వంతెన ముంబై అటల్ సేతు బ్రిడ్జ్ మీదుగా ఒక కారు అతి వేగంగా దూసుకెళ్లడంతో మెదటి సారిగా రోడ్డు ప్రమాదం సంభవించింది. బ్రిడ్జ్ రైలింగ్ను ఢీకొట్ట డంతో పాటు ఆగిపోయే ముందు చాలాసార్లు పల్టీలు కొట్టింది. ప్రమాద దృష్యాలను డాష్క్యామ్ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చిర్లే రాయ్గఢ్ జిల్లాలోని ఉరాన్ తాలూకా గ్రామం కి వెళ్తున్న కారులో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఇద్దరు మహిళలు, పిల్లలు ఉన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. డ్రైవింగ్ లో ఉన్న మహిళ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లనే కారు డివైడర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వాహనం నిటారుగా స్థానానికి తిరిగి రావడానికి ముందు వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపై కొంత దూరం జారిపోయిందని పోలీసులు తెలిపారు. అటల్ సేతు బ్రిడ్జ్ పై మెట్టమెదటి సారి ఈ ప్రమాదం జరిగిందని అయితే ఎవరికి ఏ ప్రమాదం జరగలేదన్నారు. కారు అన్ని ఫల్టీలు కోట్టినప్పటిికి ఎవరూ కూడా మృతి చెందలేదని కేవలం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అతి వేగం ఎప్పటికైన ప్రమాదాలకు దారితీస్తుందని బ్రడ్జ్ పై వెళ్లేటప్పుుడు ఎక్కువ స్పీడ్ వేళ్లకుండా చిన్నగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
Breaking News