Longest Bridge Over Sea : ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. మహారాష్ట్ర లోని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL వంతెన ను ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మొత్తం 22కిలో మీటర్ల పొడవును ఈ వంతెన కలిగి ఉంది. వాహనదారులు సింగిల్ ట్రిప్ కు రూ.350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
సాధారణంగా రోడ్డును నిర్మించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అలాంటిది సముద్ర మార్గంలో బీజేపీ ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇంజనీర్ల మేధస్సుతో ఇలాంటి అద్భుతమై బ్రిడ్జిలు సాధ్యమవుతాయి. సముద్రం పై రోడ్డు ప్రయాణ అనుభూతి కోసం ముంబై ప్రజలు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.