Transgender Opposite to Modi : లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీలో ఉంటున్నారు. ఆయనపై పోటీకి ఎవరు ఉండబోతున్నారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అఖిల భారత హిందూ మహాసభ అభ్యర్థి కిన్నార్ మహా మండలేశ్వర్ హిమాంగ్ సఖీ ఉండబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు స్వామి చక్రపాణి తెలిపారు. మోదీపై పోటీకి ఒక ట్రాన్స్ జెండర్ పోటీకి దిగడం సంచలనంగా మారింది.
బరోడాలో జన్మించిన మహా మండలేశ్వర్ హిమాంగ్ సఖీ గురించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆమె తండ్రి డిస్ట్రిబ్యూటర్ అని తెలుస్తోంది. ఆమె కుటుంబం బరోడా నుంచి ముంబయికి మకాం మార్చారని చెబుతున్నారు. పలు టీవీ షోల్లో కనిపించిన ఆమె భగవద్గీతను బోధిస్తున్న తొలి ట్రాన్స్ జెండర్ కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరిలో ఆచార్య మహా మండలేశ్వర్ గా పట్టాభిషేకం జరిగింది.
శ్రీక్రిష్ణుడి భక్తురాలైన భగవత్ కథలు, దేవి భగవత్ కథలు రాసిన అనుభవం ఉంది. మోదీకి ఈమె నుంచి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అఖిల భారతీయ హిందూ పరిషత్ మహాసభ మద్దతుతో మోదీకి వ్యతిరేకంగా పోటీలో నిలుస్తుందంటున్నారు. కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నా ప్రధాన పోటీదారు మాత్రం ఈమె అనే అభిప్రాయం వస్తోంది.
దీంతో వారణాసి నుంచి మోదీకి పోటీగా నిలబడుతున్న ట్రాన్స్ జెండర్ తో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మోదీని ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీని ఓడించడమే ప్రధానంగా ముందుకు వెళ్తున్నారు. మోదీని ఎదుర్కొనేందుకు ట్రాన్స్ జెండర్ సర్వశక్తులు ఒడ్డుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మోదీ ఓటమే వారి ఆశయంగా కనిపిస్తోంది.
మోదీ చరిష్మా రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న నేతగా మోదీ ఎదిగిపోతున్నారు. దీంతో వారణాసిలో మోదీ గెలుపు ఖాయమంటున్నారు. ఎంత మంది వచ్చినా మోదీని ఏం చేయలేరని తెలుస్తోంది. దీంతో వారణాసి బరిలో మోదీని తట్టుకునే వారుండరని చెబుతున్నారు. ఏదిఏమైనా వారణాసిలో ప్రధాని గెలుపు సులభమేనని అంటున్నారు.