Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన సంబంధం మాత్రమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్డీఏలో చేరాలని వైసిపికి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
షర్మిలపై జగన్ ఒక అండగా ప్రేమ తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమీ ఉండదని సజ్జన తెలిపారు. పవన్ పై వ్యక్తిగత కక్ష తమకేమీ లేదని సజ్జల వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాంగ్రెస్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సృజల రామకృష్ణారెడ్డి ఈ విధంగా స్పందించారు.
కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వనికి రావాల్సిన నిధుల పైన నే మా నాయకుడు పోరాటం చేస్తుంటారని. బిజెపికి ,వైసిపికి ఎలాంటి పొత్తు కానీ లోపాయి కారి ఒప్పందం కానీ ఏమి లేదని స్పష్టం చేశారు.