Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నడుస్తున్న సింగపూర్, థాయ్ లాండ్ లకు విమాన సర్వీసులు పూర్తి అక్యుపెన్సీతో నడుస్తున్నాయి. దీంతో మరికొన్ని అంతర్జాతీయ ప్రాంతాలకు సర్వీసులు పడిపేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా మలేషియాలోని కౌలాలంపూర్ కు శుక్రవారం నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి విమానం 100 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభం కావడం విశేషం.
ఈ విమానం కౌలాలంపూర్ నుంచి రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి తెల్లవారు జామున 4.20 గంటలకు (ఐఎస్టీ ఉదయం 1.50 గంటలకు) కౌలాలంపూర్ చేరుకుంటుంది. అలాగే ఈ విమానం కాంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మకావు, ఫిలిప్పీన్స్, సింగపూర్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియాలను కలుపుతుంది. ఈ విమాన పర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టు ఏపీడీ ఎస్. రాజారెడ్డి, ఎయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ సభ్యులు డా. కె,కుమార్ రాజా, ఓ. నరేష్ కుమార్, డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు.