Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు శాశ్వత శత్రువులుండరన్నట్లు ఇద్దరు మాజీ సీఎంలు ఒకే వేదికపై దర్శనం ఇవ్వడం గొప్ప విషయం. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇన్నాళ్లు బద్ధ శత్రువులుగా ఉన్న అలయ్ బలయ్ చేసుకుంటూ కనిపించడం గమనార్హం.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడంతో మూడు పార్టీలు కలిసి ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ లో కొనసాగారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు. తరువాత బాబు టీడీపీలో చేరడంతో ఇద్దరు శత్రువులుగా మారారు. ఇప్పుడు ఒకే కూటమిలో ఉండడంతో మళ్లీ మిత్రులుగా కలుసుకుంటున్నారు. ఇద్దరు కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
వైఎస్ఆర్ మరణం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ బయటకు రావడం, సొంతంగా పార్టీ పెట్టడం జరిగింది. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరం అయ్యారు. ఇప్పుడు బీజేపీలో ఉండడంతో టీడీపీ, బీజేపీ మిత్ర పక్షాలు అయినందున రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో నిలిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కల్యాణ్ ముగ్గురు కలిసి ప్రచారం చేస్తున్నారు. వారితో పవన్ కల్యాణ్ సెల్ఫీ లు దిగారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. జగన్ ను ఓడించడానికి ముగ్గురు ఒక్కటైనట్లు తెలుస్తోంది.