CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా జగన్ నుదుటిపై బ్యండేజ్ లేకుండా కనిపించారు. పైగా నుదుటిపై చిన్న మరక కూడా కనిపించక పోవడంతో సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మేనిఫెస్టో విడుదల అనంతరం సీఎం మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. అమలు చేసేవే హామీలుగా ఇస్తామని, ఇప్పటివరకు దేశంలో కూడా ఎవ్వరూ ఇచ్చిన హామీలను అమలుపరచలేదన్నారు. తాను 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసినట్లు తెలిపారు.
ఈనెల విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ కనుబొమ్మపై గాయమైంది. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఓ బాలుడు రాయి విసిరినట్లు అంగీకరించాడు.