One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి రైతుకు సాగునీరు అందిస్తాం..’’ అంటూ వైఎస్ జగన్ మేనిఫెస్టోలు విడుదల చేసినా అందులో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా కాలయాపన చేశారు. దీంతో ఏపీ మొత్తం కరువు బారిన పడుతోంది. ఇప్పుడు మళ్లీ ఓట్లు వేయండి సాగునీటి కలను నెరవేరుస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. సాగనీటి కలను నిజం చేస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు.
వైఎస్ఆర్ జలయజ్ఞం నిజం చేయాలని వైఎస్ఆర్ కలల కన్నారు. వాటిని మేం పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని ఊదరగొట్టారు. కానీ తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి. కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లను మార్చి మొదటికే మోసం చేసింది.
గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసింది. జగన్ ప్రభుత్వం మాత్రం రూపాయి కూడా వెచ్చించలేదు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సంకల్పించింది. కానీ జగన్ మాత్రం చిన్న ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. దీంతో ప్రజలు సాగునీటి కోసం తంటాలు పడాల్సి వస్తోంది. జగన్ కు మళ్లీ ఓటేస్తే ఇక అంతే సంగతి అని అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయితే సాగునీటి సమస్య ఉండదు. మేఘారెడ్డి కంపెనీ ఇచ్చే కమీషన్లకు ఆశపడి కాంట్రాక్టర్ ను మార్చారు. కాంట్రాక్టర్ ను మార్చితే మూలన పడింది. పనులు ఆపేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ చేతులెత్తేయడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. డెవలప్ మెంట్ పనులు చేయలేదు. ఎలాంటి మరమ్మతులకు నిధులు కేటాయించలేదు. ఇప్పుడు మళ్లీ జగన్ నే గెలిపిస్తే పాలన పడకేసినట్లే అవుతుంది. దీంతో వైసీపీ పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.