అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారని ఆలయ ట్రస్ట్ సిబ్బంది తెలిపారు. రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారికి ఆ చెక్కు లను అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది రూ. 11000 ఇచ్చారని ఆ చెక్కును కూడా భరత్ జీ అందించారని తెలిపారు. అయోధ్య మందిరానికి ఇప్పటికే చాలామంది ప్రముఖులు పెద్ద ఎత్తున తమ విరాళం ఇచ్చారు..
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు మరో రెండు రోజుల్లో జరగనున్నవి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగక ముందే గర్భగుడిలోని బాలరాముని (Bal Ram) దివ్యరూపం భక్తులకు దర్శన మి చ్చింది. శుక్రవారం రాంలాలా పూర్తి చిత్రం బయటకు వచ్చింది. ఇందులో రాంలాలా తలపై కిరీటం, చేతిలో విల్లు, బాణాలు ఉన్నాయి. విగ్రహాన్ని పూలమాలలు, ఆభరణాలతో అలంకరించారు.
రాంలాలా విగ్రహం (Ram Lalla Idol) తొలిచూపులోనే రామభక్తులను ఆకర్షిస్తుంది. శ్రీరాముని నుదుటిపై పూసిన తిలకం సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. విగ్రహంలో సూర్యుడు, ఓం, గణేష్, చక్రం, శంఖం, గదా, స్వస్తిక్, హనుమంతుని బొమ్మలు ఉన్నాయి. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ రాంలాలా విగ్రహాన్ని దివ్యంగా, గొప్పగా తీర్చిదిద్దారు.