రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వర్మ నేను జనంలో ఉన్నట్లు ఏదైతే చూపించారో అధి అక్షరాల నిజం అని నేను అప్పుడు జనంలో ఉన్నానని లక్ష్మిపార్వతి అన్నారు. మీకు ఓక వ్యక్తిని పరిచ యం చేయాలి అని ఎన్టీఆర్ స్టేజి నుండి నన్ను పైకి రమ్మని పిలిచాడు. ఎన్టీఆర్ స్టేజి మీదకి నన్ను లేచి రమ్మన గానే నాకు ఏమి అర్థం కాక అయోమయంలో ఉన్నాను. ఆరోజు నా పక్కన మోహన్ బాబు భార్య నాతోపాటు ఉంది పదండి స్టేషన్ పైకి వెళదాం అని ఆవిడ నాతో చెప్పింది. సరే అని నేను మోహన్ బాబు భార్యతో కలిసి స్టేజి పైకి వెళ్లగానే వెంటనే అక్కడ కరెంట్ తీసివేశారు. దీంతో మరుసటి రోజు చంద్రబాబును ఎన్టీఆర్ పిలిపించి ఎందుకు ఇలా చేశావు అని మందలించారు. ఆ తర్వాత తన హోటల్ కు నన్ను రమ్మని చెప్పడంతో నేను అక్కడికి వెళ్లాను అక్కడ ఎన్టీఆర్ ఎదుట చంద్రబాబు కూడా ఉన్నారు. అందరు ఉండగానే లక్ష్మి నాతో పాటు నువ్వు వస్తావా లేదా అని ఎన్టీఆర్ నన్ను అడిగారు. వెంటనే నేను మీ వెంటే ఉంటాను స్వామి అని ఆనాడు ఎన్టీఆర్ చెప్పాను అని లక్ష్మిపార్వతి తెలిపారు. కోద్ది రోజుల తర్వాత హైదరాబాద్ లో మీడియా సమక్షంలో ఎన్టీఆర్ నా మెడలో తాళి కట్టారని లక్ష్మిపార్వతి అనాటి విషయాలను తెలిపారు.
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.