తిరుపతి జిల్లాలో సత్యవేడు వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టిడిపిలోకి వెళ్తున్నట్లు సమాచారం అందుతుంది. రెండు మూడు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో పార్టీ లోకి జాయిన్ అవుతారని తెలు స్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో సంప్రదిం పులు చెరుకునట్లు తెలుస్తోంది. తనకిష్టం లేకపోయినా వైసీపీ అధిష్టానం తిరుపతి పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గా ప్రకటించిందనీ ఆదిమూలం తెలిపారు. గత కొద్దిరో జుల నుంచి ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం పెద్దిరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుట్రలు చేయ డం వల్ల తనకు ఎమ్మెల్యే సీటు మిస్ అయిందనీ ఆదిమూలం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉండడం ఇష్టం లేని ఆదిమూలం తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణ యం తీసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీలోకి జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైసిపి చేపట్టిన మార్పులు, చేర్పులతో చాలామంది వైసిపి నేతలు పార్టీ నీ వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.
Breaking News