Namrata Shirodkar : మహేశ్ బాబుతో నాకు ఫస్ట్ సైట్ లవ్ కాదని నమ్రత సంచలన విషయాన్ని బయటపెట్టింది. నమ్రత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేశ్ వ్యక్తిత్వం, అభిరుచులు అన్ని తెలుసని పేర్కొంది. నమ్రత, మహేశ్ బాబు కలిసి వంశీ అనే సినిమాలో నటించారు. హిరో, హిరోయిన్లుగా నటించిన సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ముందుగా స్నేహం చేసిన తర్వాతనే లవ్ అనేది పుట్టిందని తెలిపింది. వంశీ సినిమా చేసే సమయంలో ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అభిప్రాయం ఏర్పడింది.
మహేష్ బాబుతో ఉంటే లోకాన్ని మరిచిపోతానని, మూడో వ్యక్తి అవసరం కూడా ఉండదని నమ్రత చెబుతోంది. ఇద్దరికీ ఏకాంతంగా ఉండటం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఇలా ఎన్ని రోజులైనా ఉండిపోవాలని అనుకుంటామని, అందుకే సినిమాలు లేని సమయంలో ఫ్యామిలీతో గడపడానికి మహేశ్ ఇష్టపడుతుంటాడని చెప్పింది. మహేశ్ కూడా ఫ్యామిలీ ని అంతలా ప్రేమిస్తాడని చెప్పింది.
నమ్రత, మహేశ్ బాబు ప్రేమను ముందుగా సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదని అయితే ఈ విషయంలో కృష్ణ అక్క మంజుల ఈ విషయంలో హెల్ప్ చేసింది. దీంతో మహేశ్ బాబు, నమ్రత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మహేశ్ తో పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరమైనప్పటికీ ఫ్యామిలీని చూసుకుంటూ మహేశ్ కు సపోర్టుగా నిలుస్తోంది. మహేశ్ డేట్స్, కాల్షీట్స్, యాడ్స్, బిజినెస్ లు, పారితోషికం ఇలా అన్ని నమ్రతనే చూసుకుంటుంది.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ఇంటర్నేషనల్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించడం ఇదే మొదటి సారి. స్టోరీ పరంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆఫ్రికన్ లోని సఫారీ అడవుల్లో ఓ సాహసికుడి కథగా దీన్ని సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. దీంతో ఈ మూవీపై అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ చేసేందుకు కూడా నమ్రత మహేశ్ కు ఎంతగానో సపోర్టు చేస్తుందని టాక్.
Breaking News