AP BJP Leaders Silence : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై అధికార పార్టీ నేతల మాటల దాడి పెరుగుతున్నది. వైసీపీ నేతల అక్రమాలు, ఆగడాలపై కొంతకాలంగా ఆమె కొంతకాలంగా మాట్లాడుతున్నారు. వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని ఆమెపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ఇక విజయసాయి, కొడాలి నాని లాంటి వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ దీనిపై ఏపీలో బీజేపీ నేతలెవరూ స్పందించకపోవడం మరింత దారుణంగా కనిపిస్తున్నది. ఒక్క సాదినేని యామిని మినహా దీనిపై ఎవరూ స్పందించలేదు.
తమిళనాడులో ఇటీవల పార్టీ కార్యకర్తలు, హత్యలు, దాడులు పెరుగుతున్నాయని ఓ నివేదికను ఇవ్వాలని జేపీ నడ్డా ఓ కమిటీ చేశారు. ఈ కమిటీలో సభ్యురాలిగా పురందేశ్వరిని నియమించారు. తమిళనాడు కార్యకర్తల కోసం అంతగా ఆపేక్ష చూపిస్తున్న బీజేపీ, ఏపీలో నేరుగా అధ్యక్షురాలి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననం మాత్రం పట్టించుకోకపోవడం దారుణంగా కనిపిస్తున్నది. అయితే ఇది మాత్రం పురందేశ్వరికి కొంత ఇబ్బందికరంగా మారింది.
ఏపీలో పదకొండు లక్షల కోట్లకు అప్పులు చేరాయి. ఈ విషయం ఆధారాలతో సహా పురందేశ్వరి వెల్లడిస్తే, పార్లమెంట్ లో రాష్ర్టం ఇచ్చిన లెక్కలను ఇచ్చారు నిర్మలా సీతారామన్. సొంత పార్టీ నేతలపై మాటల దాడి జరుగుతున్నా ఆ పార్టీలో మిగతా నేతలు మాత్రం స్పందించడం లేదనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇక హైకమాండ్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. వైసీపీ లో నంబర్ 2గా పిలిపించుకునేB విజయసాయి కూడా పురందేశ్వరిపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా బీజేపీ అధిష్టానం స్పందించలేదు. మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా ఆ పార్టీ నేతలు కిమ్మనకుండా ఉండడం చాలా మందిలో ఆశ్చర్యం కలిగిస్తున్నది.