AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటిలో సీఎం జగన్, మంత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రధానంగా ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదంతోపాటు 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు చేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్-1, 2 పోస్టులకు కేబినెట్ ఆమోదం లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ బదులు.. జీపీఎస్ అమలుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.
అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలపనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది.
– ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ
1. జిపిఎస్ బిల్లు అమలుకు నిర్ణయం
2. 12వ పిఆర్సి ఏర్పాటుకు నిర్ణయం
3. అమ్మ ఒడి జూన్ 28 కి వాయిదా
4. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం…. కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్..!