AP Liquor Policy : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేవ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు పురంధీశ్వరి. ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీకి కొన్ని సీట్లను తేవాలని ఆ మేరకు కష్టపడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలతో ఆమె విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తు్న్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ విధానంపై దాడికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బీజేపీని వీడుతాడని వస్తున్న వార్తలను ఆమె పట్టించుకోకున్నా.. అది అధిష్టానం పరిధిలో విషయం అంటూ చెప్తున్నారు.
మద్యం పాలసీపై ఆమె సీఎం జగన్ పై విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీలో మధ్యం పాలనీ బాగాలేదని, యువత బానిసలుగా మారుతుంటే, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. లిక్కర్ పాలసీని మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్, ఈడీ, ఐటీతో మధ్యం పాలసీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆమె ఒక లేఖను రాశారు.
మధ్యం సరఫరా చేస్తున్న ఆదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రోస్ వెనుక మిథున్ రెడ్డి ఉన్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తన అనుమానం నిజమైతే మరో అతిపెద్ద లిక్కర్ స్కాం ఏపీలో అవుతుందని ఆమె ఆరోపించారు. ఏది ఏమైనా ఎన్నికలు మరికొన్ని నెలల్లో ఉండడంతో ఇప్పటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పట్ల కూడా ఆమె వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అరెస్ట్ పూర్తిగా కక్ష్య సాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు.