AP BJP : భారతీయ జనతా పార్టీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలపై కొంత క్లారిటీ వచ్చింది. నేడు రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. బిజెపి ఫైనల్ చేసే వాటిలో విజయవాడ-వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని కోరుతున్న బిజేపి అదనం గా రాజంపేట అసెంబ్లీ స్థానం కూడా కోరే అవకాశం ఉంది. జంపేట లోక్ పరిధిలో మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సుమారు లక్ష ఓట్లు క్షత్రియ సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయాలంటే రాజులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ నుంచి అయితే జగన్మోహన్ రాజు బీజేపీ అయితే చెంగల్ రాజు కు టికెట్ దక్కే అవకాశం ఉంది. రాజమండ్రి-రూరల్ అసెంబ్లీ స్థానం లేదా రాజమండ్రి-అర్బన్ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని యోచన తద్వారా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును రాజమం డ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించాలని బీజేపీ ప్రతిపా దన పెట్టినట్టు సమాచారం. మొత్తంగా ఈ రోజు జరిగే కీలక సమావేశంలో పోటీ చేసే స్థానాలతో పాటు,అభ్యర్థులపై క్లారిటీకి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.