బీఎస్ఎస్ నాయకులు ఆంధ్రాలో పార్టీని విస్తరించేందుకు పార్టీ నాయకులు శతశిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఏపీ జరుగుతున్న రాజకీయాలపై, అక్కడ జరుగుతున్న పాలనపై, అక్కడ పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై తెలంగాణ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏపీ పాలన సరిగా సాగడం లేదని,సీఎం జగన్ మోడీ చెప్పినట్లు నడుకుంటున్నాడని, గుంతలు పడ్డరోడ్లు, ఇంకా పూర్తి కాని పోలంవరం ప్రాజెక్టు, ప్రత్యేక రాజదాని అటకెక్కిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ మంత్రులపై AP Minister కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో తెలంగాణ సంస్కృతికి కాపాడలేని వారు ఏపీ రాజకీయాలపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఆంధ్రా ప్రాంత ప్రజల వల్లే తెలంగాణ అభివృద్ది చెందిందని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాలు ఊపిరిఅడనివ్వడం లేదని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడడానికి తెలంగాణ మంత్రులకు ఏం ఆర్హత ఉందో చెప్పాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
పనిలో పనిగా రజనీకాంత్ పై విమర్శలు గుప్పించారు. శత జయంతి ఉత్సవాలకు వచ్చిన రజనీ కాంత్ ఎన్టీఆర్ పై కాకుండా చంద్రబాబును పొగడడంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని రజనీకాంత్ గీత దాటి మాట్లాడారన్నారు. ఆంద్రప్రదేశ్ బాబు ఏం చేశాడని పోడిగాడో అర్థం కావడం లేదన్నారు. పవన్ పక్కకు తప్పించేందుకే శతజయంతి ఉత్సవాలకు రజనీ కాంత్ ను చంద్రబాబు పిలిచారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Minister ధీమా వ్యక్తం చేశారు.